బిజెపి సీఎంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చర్చలు

-

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు.. ఎప్పుడు పాలిటిక్స్ లో ఫుల్ జోష్ గా ఉంటారు. నిత్యం ప్రజల్లో మెలుగుతూ… ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారు మైనంపల్లి హనుమంతరావు. కరోనా సమయం నుంచి.. ఇప్పటివరకు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.

అయితే తేలంగాణ లోనే కాకుండా… ఇతర రాష్ట్రాల్లోనూ మంచి పలుకుబడి ఉంది ఆయనకు. ఇతర పార్టీ నాయకులతో, అలాగే వ్యాపారవేత్తల తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు మైనం పల్లి హనుమంతరావు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ను మర్యాదపూర్వకంగా కలిశారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. వ్యాపార సంబంధిత పనుల్లో భాగంగా కర్ణాటక వెళ్ళిన మైనంపల్లి నిన్న రాత్రి కర్ణాటక ముఖ్యమంత్రిని కలిశారు. ప్రస్తుతం ఆయన్ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news