విజయ గర్జన సభ కోసం టిఆర్ఎస్ కీలక నిర్ణయం…!

-

ఓరుగల్లు వేదికగా ఈనెల 29వ తేదీన టీఆర్ఎస్ విజయగర్జన సభ జరగనుంది. కాగా సభ నిర్వహణపై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటలో విజయగర్జన సభ జరగనుంది. కాగా సభ కోసం 15లక్షల మందిని సమీకరించాలని నిర్ణయం తీసుకుంది. జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారిగా ఇంచార్జీల నియామకం చేపట్టింది. ములుగు- రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్,డోర్నకల్- ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హుజురాబాద్- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, భూపాలపల్లి: ఎంపీ పసునూరి దయాకర్నర్సంపేట- ఎంపీ మాలోత్ కవిత,

KCR-TRS
KCR-TRS

జనగామ- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్: మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, వర్ధన్నపేట- మాజీ ఎంపీ సీతారాంనాయక్, హుస్నాబాద్ జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మహబూబాబాద్- జెడ్పి చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి, పరకాల- జెడ్పి చైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్ తూర్పు: డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, పాలకుర్తి: రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, వరంగల్ పశ్చిమ: మాజీ జెడ్పి చైర్మన్ సాంబారి సమ్మారావు లను ఇంఛార్జి లు గా నియమించింది.

Read more RELATED
Recommended to you

Latest news