TS BJP: హుజురాబాద్ బరిలో ఈటల రాజేందర్ శ్రీమతి జమున … !

-

కాసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా, ఇందులో గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారు కూడా ఉండడం గమనార్హం. కాగా గత ఎన్నికల్లో హుజురాబాద్ నుండి తెరాస నుండి బీజేపీ నుండి పోటీ చేసి గెలిచారు ఈటల రాజేందర్. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గాన్ని మార్చుకున్నాడు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గజ్వెల్ నుండి పోటీ చేయనున్నారు. ఇక హుజురాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ సతీమణి శ్రీమతి ఈటల జమున పోటీ చేయనున్నారు. ఇప్పుడు ఈటలకు ఇప్పుడు డబుల్ వర్క్ చేయాల్సి ఉంది, ఒకవైపు తన గెలుపుకు గజ్వెల్ లో కృషి చేస్తూనే .. మరోవైపు హుజురాబాద్ లో తన భార్య జమునను గెలిపించుకోవలసి వస్తుంది.

అయితే హుజురాబాద్ లో ఈటలకు ఉన్న మంచి పేరు కారణంగానే జమున ఈజీగా గెలిచే అవకాశం ఉందన్న ధైర్యంతోనే ఈటల తన నియోజకవర్గాన్ని మార్చుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version