జూన్ 20 న ఐసెట్ ఫలితాలు విడుదల… !

-

నిన్న మరియు ఈ రోజు తెలంగాణాలో నిర్వహించిన ఐసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షకు మొత్తం 75 వేల మంది విద్యార్థులు అప్లై చేసుకోగా, వారిలో కేవలం 70900 మంది మాత్రమే హాజరయినట్లు తెలుస్తోంది. అయితే పరీక్షకు పూర్తి అయిన వెంటనే విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా ? ఎన్ని మార్కులు వస్తాయి ? రాంక్ ఎంత వస్తుంది అని ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం MBA మరియు MCA కోర్స్ లలో చేరడానికి గాను రాసిన పరీక్షల ఫలితాలను జూన్ న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ విజయలక్షి తెలియచేశారు.

కాగా జూన్ 5న ఈ పరీక్ష కీ పేపర్ ను విడుదల చేస్తామని తెలుపగా, ఈ కీ పేపర్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే జూన్ 6 నుండి 8వ తేదీ వరకు మాకు తెలియచేయవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news