ఈ మహా డ్రామా చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది… : మంత్రి బొత్స

-

ఏపీలోని రాజమండ్రి లో మహానాడు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ చిత్రపటానికి చంద్రబాబు నాయుడు పూల దండ వేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడంతో వైసీపీ నాయకులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజమండ్రిలో మహా డ్రామా ను చంద్రబాబు దగ్గరుండి నడిపిస్తున్నది కామెంట్ చేశాడు. చంద్రబాబు ఎన్టీఆర్ కు పూల దండ వేస్తే ఆయన ఆత్మ ఏ లోకాన ఉన్నా క్షోభిస్తుందని ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదన్నారు.

ఎప్పుడూ ఎలా అధికారంలోకి రావాలన్నదే ఆయన ప్రధమ లక్ష్యమని మండిపడ్డాడు. కానీ అధికారంలోకి రావడమా ముఖ్యం కాదని ప్రజలకు మంచి చేయడం ముఖ్యమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news