టెట్‌ అభ్యర్థులకు శుభవార్త.. నేటి నుంచి హాల్‌ టికెట్లు

-

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లయ్‌ చేసుకున్నారు. ఇక TS TET 2022 పరీక్ష జూన్ 12న జరగనుంది. ఈ టెట్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు నేటి నుంచి https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

టెట్ పూర్తయిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయొచ్చు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version