న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య చేసుకుంది. టీ న్యూస్ చానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. జవహర్ నగర్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది న్యూస్ యాంకర్ స్వేచ్చ. దింతో న్యూస్ యాంకర్ స్వేచ్చ డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్లోనివాసం ఉంటున్నారు యాంకర్ స్వేచ్చ.

స్వేచ్ఛకు ఇదివరకే వివాహం అయ్యి సుమారు 13 ఏళ్ళ కూతురు ఉండగా.. కొన్ని కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణ చందర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న స్వేచ్ఛ.. గత కొంతకాలంగా పూర్ణ చందర్తో విభేదాలు ఉన్నట్లు స్నేహితుల నుండి అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇక స్వేచ్ఛ మృతికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.