దుబ్బాక బై పోల్ లో ట్విస్ట్.. ఆ రెండు కేంద్రాలలో ఇంకా తేలని రిజల్ట్ !

-

దుబ్బాల ఎన్నికల్లో బీజీపీ అభ్యర్ధి రఘునందన్ రావు గెలిచినట్టు వార్తలు వెలువడుతోన్న క్రమంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ కీలక ప్రకటన చేశారు. దుబ్బాక లెక్కింపులో నాలుగు ఈవీఎంలకు సంబంధించి సాంకేతిక సమస్యలు వచ్చాయని ఆయన ప్రకటించారు. నాలుగు ఈవీఎంలలో ఇంకా 1669 ఓట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

21, 188 పోలింగ్ కేంద్రాల్లో రిజల్ట్ రాలేదు, అక్కడ వీవీప్యాట్ లోని స్లిప్పులు లెక్కిస్తామని అన్నారు. 136, 157/A పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ తర్వాత ఆ ఓట్లను క్లియర్ చేయ లేదు అని నిబంధనల ప్రకారం వాటి లెక్కింపు చేపడతామని ఆయన పేర్కొన్నారు. అయితే మెజారిటీ కంటే ఇంకా లెక్కించాల్సిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో బీజేపీ కార్యకర్తలలో మళ్ళీ టెన్షన్ మొదలయింది. అయితే ఆ రెండు కేంద్రాల్లో కూడా తమకే మెజారిటీ వస్తుందని బీజీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news