మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ప్రాణహాని ఉంది..అందుకే చంపాలనుకున్నాం : నిందితుల సంచలన స్టేట్మెంట్

-

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాఘవేంద్ర రాజు స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణహాని ఉందని… శ్రీనివాస్ గౌడ్ తనపై 30 కేసులు పెట్టించారని స్టేట్ మెంట్ లో రాఘవేంద్ర రాజు పేర్కొన్నారు. తన వైన్ షాప్ ను మూసివేయించిన ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇబ్బంది పెట్టారని.. ఆర్థికంగా కూడా తనకు నష్టం చేయించారని రాఘవేంద్ర రాజు వెల్లడించారు.

ఒకేరోజు తనపై 10 కేసులు పెట్టించారని… తనకు ఏకంగా ఆరు కోట్ల నష్టం చేశారని వివరించారు. తనకు రావాల్సిన డబ్బులు రాకుండా అడ్డుకున్నారని… తనపై ఎస్సీ మరియు ఎస్టీ కేసులు కూడా పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు రాఘవేంద్ర రాజు. 2017 నుంచి తనను చంపేందుకు శ్రీనివాస్గౌడ్ యత్నం చేశారని… తనను తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు రాఘవేంద్ర రాజు. ఈ వేధింపులు తట్టుకోలేక నేను శ్రీనివాస్ గౌడ్ ను చంపాలనుకున్నానని పోలీసులకు వివరించాడు రాఘవేంద్ర రాజు.

Read more RELATED
Recommended to you

Latest news