ఆ రెండు రోజులు.. నగరంలో నీటి సరఫరా బంద్..!

-

హైదరాబాద్ దగ్గర వాసులకి బ్యాడ్ న్యూస్. పట్టణం లో పలు ప్రాంతాల్లో రెండు రోజులు పాటు నీటి సరఫరా ని జలమండలి నిలిపివేయబోతోంది. ఇక పూర్తి వివరాలను చూస్తే నగరానికి సరఫరా అవుతున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేస్ వన్ లో భాగం గా మీరాలం, అలియాబాద్ ప్రాంతం వద్ద 1200 ఎంఎం డయాఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్ లైన్ కి జంక్షన్ మరమ్మత్తులు కారణంగా ఈ నెల 20న ఉదయం 6 నుండి 21 ఉదయం 6 దాకా నీటి సరఫరా ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

మీరాలం, అలియాబాద్ ఆఫ్ టెక్ ప్రాంతం వద్ద మెయిన్ పైప్ లైన్ జంక్షన్ రిపేర్ చేయబోతున్నారు. ఈ పనులు కారణంగా తాగు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబోతున్నట్లు వాటర్ బోర్డ్ చెప్పింది. చాంద్రాయ గుట్ట సన్నీ గార్డెన్ నుండి షోయబ్ హోటల్ దాకా పైప్ లైన్ జంక్షన్ పనులు చేపట్టబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news