దారుణం : నడిరోడ్డు మీద ఇద్దర్ని నరికితే, చోద్యం చూసిన జనం !

-

ఢిల్లీలోని ఒక బిజీగా ఉండే నివాస ప్రాంతంలో ఒక 19 ఏళ్ల యువకుడిని ఒక గ్యాంగ్ కొట్టి, అనంతరం పొడిచి చంపడానికి చూశారు. అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని కూడా వాళ్ళు పోడి చేశారు. పగటి పూట ఇంత జరుగుతున్నా ఎవరూ కనీసం వారిని పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన సీసీ టీవీ కెమెరా లో రికార్డ్ అయింది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. వారిని సోమ్‌ప్రకాష్, సూరజ్‌గా గుర్తించారు. ఈ నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది.

దీపావళి రోజున జరిగిన చిన్న వాగ్వాదం ఈ మర్డర్ అటెంప్ట్ కు కారణం అయినట్టు చెబుతున్నారు. మొదట గాయపడిన 19 ఏళ్ల వ్యక్తిని శివం అని, అతని స్నేహితుడు మోహిత్ అని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కాశ్మీరీ గేట్‌లోని ఒక గాయం కేంద్రంలో వారి గాయాలకు వైద్య సహాయం పొందుతున్నారు, వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానిక ఆసుపత్రి నుండి వేరే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కత్తిపొట్లకు గురియిన సమయంలో అక్కడే ఉన్న దుకాణదారులు, సామాన్య జనం చోద్యం చూసినా కానీ ఎవరూ జోక్యం చేసుకోలేదు.  

Read more RELATED
Recommended to you

Latest news