దారుణం.. విషం పెట్టి 20 కుక్కలను చంపారు..

-

ఒడిశాలోని కటక్‌ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 20 వీధి కుక్కలకు వారు విషం పెట్టి చంపారు. జూన్‌ 19వ తేదీన అక్కడి భౌన్‌రియా గ్రామ పంచాయతీ పరిధిలోని నహంగా గ్రామంలో నివాసం ఉండే బ్రహ్మానంద మల్లిక్‌ (61), అతని మేనల్లుడు భరత్‌ మల్లిక్‌ (40)లు స్థానికంగా ఉన్న 20 వీధి కుక్కలకు విషం పెట్టి హతమార్చారు. ఆ కుక్కల్లో ఓ కుక్క వారు పెంచుకుంటున్న ఓ మేకను కరిచింది. దీంతో వారు విషముష్టి అనే చెట్టు బెరడును నీటిలో మరిగించి విషం తయారుచేశారు. దాన్ని మేక, కోడి మాంసాల్లో కలిపి ఆ మాంసం ముక్కలను గ్రామంలో అక్కడక్కడా పెట్టారు. ఈ క్రమంలో ఆ మాంసం ముక్కలను తిన్న ఆ కుక్కలు చనిపోయాయి.

two men poisoned 20 dogs

కాగా ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గగన్‌ బిహారీ సెథి, పలువురు వార్డు మెంబర్లు ఈ విషయంపై వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న బిజు యువ వాహిని అనే ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వాలంటీర్లు ఆ ఇద్దరిపై మహంగ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. పోలీసులు ఆ ఇద్దరిపై జంతు హింస చట్టం సెక్షన్లు 428, 429ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి ఆ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఇక ఈ అమానుష సంఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని, వారు కుక్కలను చంపి ఇన్ని రోజులు అవుతున్నా పోలీసులు ఇంకా నిందితులను ఎందుక అరెస్టు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని కచ్చితంగా పట్టుకుని తీరుతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news