రాములమ్మతో పాటు బీజీపీలోకి మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ?

-

గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బిజెపిలోకి కాంగ్రెస్ కు చెందిన కీలక నేత ఒకరు వెళ్తున్నారని అంటున్న ఆ పార్టీ నేతలు ఆ నేత మరెవరో కాదు విజయశాంతి అని బహిరంగంగానే చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు పార్టీలు మారిన రాములమ్మ మళ్ళీ సొంతగూటికి వెళ్తారని దాదాపు ఖరారు అయినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు దాదాపు ఎర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. విజయశాంతి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. ఆమె నవంబర్ 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, లేదా అమిత్ షా సమక్షంలో కందువ కప్పుకునే అవకాశం ఉంది. ఇక ఆమె మీద గతంలో బండి సంజయ్ కూడా ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు తగిన గుర్తింపు లభించడం లేదని అన్నారు. నిజానికి విజయశాంతి బీజేపీతోనే రాజకీయ అరంగేట్రం చేశారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె అసంతృప్తిగా ఉన్నారు.ఇక ఈమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మరో ఇద్దరు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news