ఆశ్రమంలో టీ తాగి ఇద్దరు సాధువులు మృతి, అసలేం అయింది…?

-

ఉత్తరప్రదేశ్ లోని మధుర వివాదాస్పద ఘటన జరిగింది. టీ తాగిన ఇద్దరు సాధువులు మరణించడం వివాదంగా మారింది. గులాబ్ సింగ్ మరియు శ్యామ్ సుందర్ అనే ఇద్దరు సాధువులు టీ తాగి మరణించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… 60 ఏళ్ల గులాబ్ సింగ్ అక్కడికక్కడే మరణించగా, సాధు శ్యామ్ సుందర్ (61) ను జిల్లా ఆసుపత్రిలో వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు.

dead body
dead body

రామ్ బాబుగా గుర్తించిన మూడవ సాధు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారి మరణాలకు కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృందం ఆశ్రమం వద్ద సాక్ష్యాలు సేకరిస్తుంది. ఇద్దరు సాధువులు టీ సేవించి మరణించారని పేర్కొన్నారు. టీలో విషం కలిపారు అని అందుకే మరణించారు అని వారి బంధువులు ఆరోపించారు. పంచనామా చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news