కు.ని. ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతి

-

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న 27 మంది మహిళల్లో ముగ్గురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అందులో ఇద్దరు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈనెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో 27 మంది మహిళలకు కుని ఆపరేషన్లు చేశారు.

మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మంచాల మండలం లింగంపల్లి చెందిన సుష్మతో పాటు ఇబ్రహీంపట్నం పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్యలు ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత వీరు ముగ్గురూ అస్వస్థతకు గురి కాగా.. మమతను బీఎన్‌రెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందింది. పరిస్థితి విషమించిన సుష్మను ఇబ్రహీంపట్నంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు రాగా.. చికిత్స పొందుతూ ఆమె తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. సీతారాంపేటకు చెందిన లావణ్యను హైదరాబాద్‌లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news