బీజేపీ నేత ఉమాభారతికి కరోనా పాజిటివ్

-

కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ భారీగా నమోదు అవుతున్నాయి. ఇండియాలో రోజూ లక్షకు చేరువలో కరోన కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా సామాన్యులకే కాక సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకి కూడా ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా బిజెపి సీనియర్ నేత ఉమా భారతి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆమె తనకి పాజిటివ్ వచ్చినట్టు నిన్న అర్ధరాత్రి ట్వీట్ చేసింది. అలానే తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరినీ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోమని ఆమె కోరింది.

ఇక ఆమె మూడు నుండి తేలికపాటి జ్వరంతో బాధపడుతోందని, ఇటీవల హిమాలయాలకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం సహా అన్ని కోవిడ్ -19 నిబంధనలను పాటించినప్పటికీ ఆమెకు వైరస్ సోకిందని ఆమె చెప్పుకొచ్చింది. “నేను ప్రస్తుతం హరిద్వార్ మరియు రిషికేశ్ మధ్య ఉన్న వందే మాతరం కుంజ్ వద్ద స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నాలుగు రోజుల తర్వాత మరో కోవిడ్ -19 పరీక్ష చేయించుకుంటాను, పరిస్థితి అలాగే ఉంటే వైద్యులను సంప్రదిస్తాను ”అని ఉమా భారతి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news