బ్రేకింగ్ : బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు అస్వస్థత ?

-

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు తెలంగాణా బీజేపీ నేతలకు కలవరంగా మారింది. మొన్నటి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళిన ఆయన సెల్ఫ్ క్వారన్ టైన్ లో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ లో చేరినట్లు.. సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి.

తాజాగా జాతీయ కార్యవర్గ సభ్యుడు కృష్ణదాస్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు సంజయ్ ప్రైమరీ కాంటాక్ట్ కావడంతోనే సెల్ఫ్ క్వారన్ టైన్ లో ఉన్నట్టు చెబుతున్నారు. సంజయ్ బాగానే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో పార్టీ వర్గాల మాట వినాలో లేక సన్నిహితుల మాట వినాలో అర్ధం కాక పార్టీ శ్రేణుల్లో గందరగోళం, ఆందోళన నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news