ప్రభాస్ ఫ్యాన్స్ కి తప్పని నిరాశ..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రాముడిగా నటించిన చిత్రం ఆది పురుష్ .. జూన్ 16వ తేదీన విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే మొదటి మూడు రోజులు చాలా అద్భుతమైన ఓపెనింగ్ వచ్చినప్పటికీ కూడా నాలుగవ రోజు నుంచి వసూలు మాత్రం పెద్దగా రాలేదని చెప్పాలి.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి 70 కోట్ల రూపాయల నష్టం బయ్యర్స్ కి వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు.

ఇకపోతే నష్టం అనేది ప్రభాస్ సినిమాలకు కామన్ అయిపోయింది.. ఎందుకంటే ఆది పురుష్ తో కలిపి ఆయన హీరోగా నటించిన గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కనీసం ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ కి తగ్గట్టుగా కూడా వసూళ్ళు రాకపోవడంతో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇక సాహో చిత్రానికి కూడా క్లోజింగ్ సమయం ముగిసే సరికి 450 కోట్లు వచ్చాయి కానీ ఆ వసూళ్లు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఏమాత్రం సరిపోవు కేవలం మూడు రోజుల్లో వచ్చిన వసూలు మాత్రమే.

అయితే ఇప్పుడు సలార్ చిత్రం కూడా ఇలా మూడు రోజులు ఆడేసి థియేటర్ నుండి వెళ్లిపోయే సినిమా అవబోతోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సలార్ చిత్రాన్ని కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సీరీస్ లు కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి పెద్దగా ఇష్టపడరు. కాబట్టి సినిమా కూడా మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఒక మంచి బ్లాక్ బాస్టర్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు మళ్లీ నిరాశ మిగిలేటట్టే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news