నేడు నిజామాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు అమిత్ షా. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు అమిత్ షా.

ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్న అమిత్ షా …. 2.35 గంటలకు నిజామాబాద్-కంఠేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొననున్న అమిత్ షా.. సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు.