పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ఎమోషనల్ ట్వీట్

-

తనకు పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి ట్వీట్‌ చేసింది మెగాపవర్ స్టార్ రామ్​ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్లు చెప్పింది. రామ్‌చరణ్‌తో కలిసి ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌లో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. దేశం గర్వించే విజయం ఇది. ఈ ప్రయాణంలో నేనూ భాగమయ్యేలా చేసిన రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణాలు భావోద్వేగంగా అనిపిస్తున్నాయి’’ అని ఉప్సీ పేర్కొంది. దీనిని చూసిన మెగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

భారతీయ సినీ ప్రేక్షకులకు ‘RRR’ తీయని కబురు అందించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్‌‌’ అవార్డు ఈ  చిత్రానికి వరించింది. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ ఈ అవార్డును సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news