బ్రేకింగ్‌: హుజూర్‌న‌గ‌ర్ ఓట్ల లెక్కింపు పూర్తి… సైదిరెడ్డికి భారీ మెజార్టీ

-

హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ‘కారు’ ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. ఇప్ప‌టికే కౌంటింగ్ పూర్త‌య్యింది. మొత్తం 22వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 42 వేల పైచిలుకు మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అయితే ఏ ఒక్క రౌండ్‌లోనూ కాంగ్రెస్.. ‘కారు’కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. కౌంటింగ్ పూర్తవ్వడంతో టీఆర్ఎస్ గెలుపును ఎన్నికల అధికారి.. అధికారికంగా ప్రకటించనున్నారు.

ఉప ఎన్నికలో మొత్తం వన్ సైడ్ వారే నడిచింది. మొదటి రౌండ్ నుంచి టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికే మెజార్టీ వచ్చింది. మొదటి రౌండ్ నుంచి ఐదో రౌండ్ వరకు కొంత మేర మెజార్టీ వస్తున్నా ఇక ఆరో రౌండ్ నుంచి డబుల్ ధమాకానే లభించింది. ఆరో రౌండ్ లో 11,919, ఏడో రౌండ్లో 13023, ఎనిమిదో రౌండ్లో 14,592, 10 రౌండ్లో 18,583, 12వ రౌండ్లో 23,821, 14వ రౌండ్లో 26,999, 15వ రౌండ్లో 29,967 ఓట్లతో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజలో దూసుకువెళ్తున్నారు. ఏ రౌండ్లోనూ కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news