అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్ చుర‌క‌.. కళ్లద్దాలు సరి చేసుకొని చదువుకోండంటూ..

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. స‌భ ఆదిలోనే స్పీకర్-చంద్రబాబు మధ్య ఒకింత మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇక మ‌రోవైపు.. ‘సన్నబియ్యం’పై పెద్ద చర్చే జరిగింది. పాదయాత్రలో ప్రజల నుంచి ఎన్నో సూచనలు తీసుకున్నానని, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అలాగే అప్పట్లో టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఆన్ లైన్ లో నుంచి తీసేసింది. మేమలా చేయట్లేదు. మా మేనిఫెస్టో అందరికీ అందుబాటులోనే ఉంది.

ఈ మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత.. ఈ విషయాన్ని చెబుతూ మా మేనెఫెస్టోను ఎన్నికల ముందు విడుదల చేశాం’ అని అన్నారు. ‘ఇందులో ఉన్న ప్రతి అంశం మేము అమలు చేస్తామని ఓట్లు అడిగాం. చాలా ప్రధాన విషయం ఏంటంటే దీంట్లో ఎక్కడా మేము బియ్యం గురించి పేర్కొనలేదు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్నాం. కావాలంటే కళ్లద్దాలు సరి చేసుకొని చదువుకోండి.. ఎవరైనా చదువుకోవచ్చు’ అని చుర‌క వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news