యూఎస్ లో విజృంభిస్తున్న కరోనా… తాజాగా 2.6 లక్షల కేసులు నమోదు.. !

-

కరోనా వైరస్ వల్ల వచ్చిన సమస్యలు చిన్నవి కాదు. నిజంగా ఈ మహమ్మారి వల్ల ఎంతగానో సతమతమవుతున్నాము. అయితే యునైటెడ్ స్టేట్స్ లో డెల్టా వేవ్ విజృంభిస్తోంది. దేశంలో లక్షల మంది కరోనాతో సతమతమవుతున్నారు. యావరేజ్ గా చూస్తే… 1.5 లక్షల కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. కేవలం మంగళవారం నాడు చూసుకున్నట్లయితే 2.66 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. నిజంగా ఎంత దారుణమో కదా.. ఏకంగా 43 రాష్ట్రాలలో ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి అని తెల్సుస్తోంది.

డిసెంబర్ తర్వాత నుండి కూడా యుఎస్ లో పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ లో 3.8 కోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా 6.3 లక్షల మంది కరోనా కారణంగా మరణించారు ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని.. కరోనా కేసులుని కంట్రోల్ చేయాలని అంటున్నారు నిపుణులు.

భారతదేశంలో కూడా మొన్న మొన్నటి వరకూ ఇంత ఘోరమైన స్థితి ఉంది. ఇదిలా ఉంటే భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కలిగినప్పుడు మీడియా కవరేజ్ ఎక్కువగా ఉంది. కానీ యుఎస్ లో రెండు లక్షలు దాటి కేసులు నమోదైతే కూడా మీడియా కవరేజ్ లేకపోవడం ఆశ్చర్యకరం.

అయితే భారతదేశంలో మృతదేహాలకు, అంత్యక్రియలు మొదలైనవాటిని చిత్రీకరించిన అదే మీడియా ఇప్పుడు యూఎస్ గురించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. అలానే యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న పరిస్థితిని అసలు ఏమాత్రం నివేదించడం లేదు. కేవలం విదేశీ పత్రికలు ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్స్.. బిడెన్ పరిపాలన గురించి, ఆఫ్ఘనిస్తాన్ లో కలిగిన నష్టం గురించి మాత్రమే మీడియా కవరేజ్ చేస్తోంది. కానీ కరోనాకి సంబంధించి ఎటువంటి సమాచారం రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news