నిద్ర మత్తు వల్లే రిషబ్ పంత్ కు ప్రమాదం !

-

క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పందించారు. పంత్ ఢిల్లీ నుంచి రూర్కి వస్తుండగా కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడు అనగా సిటీకి కొద్ది దూరంలో యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పారు.

ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడని, తెల్లవారుజామున కావడంతో నిద్రమత్తులో ఉండటం వల్లే కారు అదుపుతప్పి రీయిలింగ్ ను ఢీ కొట్టినట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా, ఇవాళ ఉదయం టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version