BREAKING : గన్నవరం వదిలి.. మొహాలీకి వల్లభనేని వంశీ

-

BREAKING : కృష్ణా జిల్లాలోని గన్నవరం రాజకీయం మరో మలుపు తిరిగింది. ఊహించని విధంగా వైసీపీ శ్రేణులు టి‌డి‌పి ఆఫీసుపై, టి‌డి‌పి నేత ఇంటిపై దాడి చేయడం, టి‌డి‌పి శ్రేణులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడం..అక్కడకు వైసీపీ శ్రేణులు రావడం, దీంతో ఇరువర్గాల మధ్య మళ్ళీ గొడవ జరగడంతో గన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయ్యాయి.

ఈ తరుణంలో గన్నవరం వదిలి.. మొహాలీ వెళ్లనున్నాడు టీడీపీ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను చదువుకోడానికి మొహాలి వెళుతున్నానని 15 రోజుల వరకు గన్నవరం రానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. విజయవాడలో కొందరు సన్నాసుల వల్లే గన్నవరం గొడవ జరిగిందని ఆరోపించారు. అది చంద్రబాబు వేసిన పక్కా ప్రణాళిక అని, సీన్ కాస్త రివర్స్ అయ్యేసరికి టిడిపికి షాక్ తగిలిందని చెప్పారు. గన్నవరం ఘటనపై టిడిపి కేసు పెట్టలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news