ఎన్టీఆర్‌ని లోకేష్‌ పార్టీలోకి ఆహ్వానించడం అతిపెద్ద జోక్‌ – వల్లభనేని వంశీ

-

చంద్రబాబు కామెంట్స్ పై వల్లభనేని వంశీ కౌంటర్ అటాక్ చేశారు. జూ.ఎన్టీఆర్‌ని లోకేష్‌ పార్టీలోకి ఆహ్వానించడం అతిపెద్ద జోక్‌ అని.. టీడీపీని స్థాపించింది జూనియర్ తాత సీనియర్ ఎన్టీఆర్ అన్నారు. కానీ, లోకేష్ తాత ఖర్జూరపు నాయుడు కాదు.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు జూ.ఎన్టీఆర్‌ని లోకేష్ ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని చురకలు అంటించారు వల్లభనేని వంశీ.


దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగొచ్చని… చంద్రబాబు కావాలనుకుంటే ఆది సినిమా లో లాగా అస్సాం వెళ్ళొచ్చని వివరించారు. నడుముకు రాకెట్ కట్టుకుని ఆకాశంలోకి ఎగరొచ్చు… కావాలంటే గోదావరి లోకి కూడా దూకొచ్చని ఫైర్‌ అయ్యారు వల్లభనేని వంశీ.

సెక్షన్ 144, 31 అమలు లో ఉన్నప్పుడు పోలీసులు నియంత్రిస్తారని.. తన హయాంలో ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణ మాదిగ లు రాష్ట్రంలో తిరక్కుండా చంద్రబాబు నియంత్రించాడని నిప్పులు చెరిగారు. ఉద్రిక్త పరిస్థితులు ఉండటం వల్లే ఒక రోజు చంద్రబాబు గన్నవరం వెళ్ళకుండా పోలీసులు నియంత్రించారని… చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమని చెప్పారు వల్లభనేని వంశీ.

Read more RELATED
Recommended to you

Latest news