AP News : శ్రీసిటీలో వందేభారత్‌ రైలు విడిభాగాల తయారీ

-

ఏపీలోని శ్రీసిటీలో వందే భారత్ సెమీ హైస్పీడ్‌ రైలు విడిభాగాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి బీఎఫ్‌జీ ఇండియా పరిశ్రమలో 2009 నుంచి పవన విద్యుత్‌, నిర్మాణ, రవాణా వంటి రంగాల్లోని పరిశ్రమలకు మిశ్రమ ఉత్పత్తులు, ప్రత్యేక ఆకృతులను తయారు చేస్తోంది. ప్రధానంగా మెట్రో కోచ్‌ల తయారీ సంస్థలైన ఆల్‌స్తోమ్‌, బొంబార్డియర్‌, వోల్వోలతోపాటు ఇండియన్‌ రైల్వేస్‌, జనరల్‌ ఎలక్ట్రికల్‌-ఎనర్జీ, గమేశ, కొచ్చిన్‌ షిప్‌యార్డు, థెర్మాక్స్‌ వంటి వివిధ సంస్థలు దీని సేవలను అందుకుంటున్నాయి.

వందేభారత్‌ రైలులోని ఇంటీరియర్‌, టాయిలెట్‌ క్యాబిన్‌, ఇంజిన్‌ ముందుభాగాన్ని బీఎఫ్‌జీ సంస్థ సరఫరా చేస్తోంది. ఒక్కో రైలు కోసం 329 రకాల ఫైబర్‌ రీ ఇన్‌ఫోర్స్డ్‌ ప్లాస్టిక్‌(ఎఫ్‌ఆర్పీ) ప్యానెళ్లను తయారు చేసింది. ఇచ్చిన పనులను రికార్డుస్థాయిలో పది నెలల్లోనే పూర్తి చేసింది. దిల్లీ మెట్రో రోలింగ్‌ స్టాక్‌(కోచెస్‌) కోసం బొంబార్డియర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌లో దాని వ్యూహాత్మక సరఫరాదారుగా ఉంటూ… లోపలి, ముందు, వెనుకభాగాలు, డ్రైవర్‌ క్యాబ్‌లతోసహా ఎఫ్‌ఆర్పీ విడిభాగాలను సైతం బీఎఫ్‌జీ ఇండియా తయారు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news