కొడాలి నానిని హరికృష్ణ అందుకే తన్ని తరిమేసాడు – వంగలపూడి అనిత

-

ఈ నెల 15న విశాఖ లో జరిగేది ప్రజా గర్జన కాదు.. భూ కబ్జా రాయుళ్ల సభ అని తీవ్ర విమర్శలు చేశారు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. విశాఖలో ఏర్పడింది జాయింట్ యాక్షన్ కమిటీ కాదు.. జగన్ యాక్షన్ కమిటీ అని ఎద్దేవా చేశారు. విశాఖను దోచుకోవడానికే రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు.

అమరావతి రైతుల కాళ్ళు విరగ్గొడితే.. మా దగ్గర కర్రలు ఉన్నాయి.. మీకు కాళ్ళు ఉన్నాయి అని మర్చిపోవద్దు అంటూ హెచ్చరించారు. మీరు రైతులపై ఒక కర్ర ఎత్తితే.. మేము 100 కర్రలు తీస్తాం అన్నారు. కొడాలి నాని గతంలో హరికృష్ణను ముంచాడు.. అందుకే హరికృష్ణ తన్ని తరిమేశాడని తీవ్ర విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను కొడాలి నాని మోసం చేశాడు.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ నానిని దూరంగా పెట్టాడని అన్నారు.

ఇప్పుడు సీఎం జగన్ కి నాని టోపి పెట్టాడు.. అందుకే నానిని క్యాబినెట్ నుండి జగన్ తరిమేశాడని ఆరోపించారు. పదో తరగతి ఫెయిలైన బ్యాచ్ అంత వైసీపీలో ఉన్నారని అన్నారు. విశాఖ భూ స్కామ్ లు బయటపడతాయని అమరావతి రైతుల యాత్రను అడ్డుకుంటామని వైసీపీ బెదిరిస్తుందన్నారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ వేల కోట్ల భూములు కబ్జా చేసి భూ యజమానులకు ఒక శాతం మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news