బిజెపి నేతలు చిల్లర గాళ్ళు.. జైశ్రీరామ్ నినాదాలపై ప్రశాంత్ రెడ్డి ఫైర్

-

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన పై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ శంషాబాద్ లో జరిగిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో మొత్తం బిజెపి కార్యకర్తలతో నింపారని ఫైర్ అయ్యారు.

నేను ప్రసంగం చేసేందుకు సిద్ధం అయితే బిజెపి కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారని అగ్రహించారు. 5 నిముషాలు నేను ప్రసంగం ఇవ్వకుండా ఆగిపోయా…అంత చిల్లరగా బిజెపి కార్యకర్తలు వ్యవహరించారని ఫైర్ అయ్యారు.

నితిన్ గడ్కరీ మీద ఉన్న గౌరవం తో ఆ కార్యక్రమంకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళామని చెప్పారు వేముల ప్రశాంత్ రెడ్డి. జాతీయ రహదారుల కోసం 8 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఎంతో ఆర్భాటం చేస్తున్నారని.. ఇక ముందు రాష్ట్రంలో జరిగే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లేలా లేదా అన్న ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version