ఎల్లుండి ఏపీకి రానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

-

ఎల్లుండి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీకి రానున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం ఈ నెల 9వ తేదీన తిరుమలకు రానున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 9 వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకోనున్నారు వెంకయ్యనాయుడు. రెండు గంటలకు తిరుపతిలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

ఇక అదే రోజు సాయంత్రం తిరుమలకు చేరుకొని రాత్రి అక్కడే బస చేయ్యనున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇక ఆ తర్వాత రోజున అంటే… 10వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అటు తరువాత పుష్పగిరి మఠంలో ప్రవైట్ కార్యక్రమంలో పాల్గోనున్నారు వెంకయ్యనాయుడు. మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళనున్నారు వెంకయ్య నాయుడు.. అక్కడి నుంచి మళ్లీ అదే రోజున ఢిల్లీ వెళతారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news