కిరణ్ కుమార్ రెడ్డి.. న్యాయమా రా బై నీకు – వీహెచ్‌ ఫైర్‌

-

కిరణ్ కుమార్ రెడ్డి.. న్యాయమా రా బై నీకు అంటూ వీహెచ్‌ ఫైర్‌ అయ్యారు. మంత్రి పదవి కూడా చేయని కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్ అని.. పార్టీ కష్టకాలం లో ఉన్నప్పుడు అండగా ఉండాలని కోరారు వీహెచ్‌. కానీ పార్టీ వదిలి పారిపోవడం ఏంటి..? కాంగ్రెస్ మీ దెబ్బకొట్టాలని చూస్తున్న బీజేపీ లో చేరడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు.

కిరణ్ కుమార్ రెడ్డి.. న్యాయమా రా బై నికూ అంటూ ఫైర్‌ అయ్యారు. రెండున్నర ఏండ్లలో నువ్వు..నీ తమ్ముడు ఎంత సంపాదించారో మాకు తెలియదా అని ఆగ్రహించారు. సీఎం ని చేసిన పార్టీ కి వెన్నుపోటు పొడిచిన వాడు.. బీజేపీ కి వెన్నుపోటు పొడవడు అని గ్యారంటీ ఏముందన్నారు. పార్టీ మారడం ఆయనకు వ్యాపారం అయ్యిందని చురకలు అంటించారు. ఉన్నవి దాచుకోవడం కోసమే బీజేపీ లోకి వెళ్ళాడు… భయంతో బీజేపీ లోకి వేళ్ళవా… బెదిరిస్తే పోయావా..? అని సెటైర్లు పేల్చారు వీహెచ్‌.

Read more RELATED
Recommended to you

Latest news