OFFICIAL : విజయ్‌ దేవరకొండతో.. పూరి మరో పాన్‌ ఇండియా మూవీ

-

టాలీవుడ్‌ సంచలన డైరెక్టర్‌… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్టేట్స్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే..ఈ సినిమా విడుదల కాకముందే… ఓ అదిరిపోయే అప్ డేట్‌ ఇచ్చారు పూరి జగన్నాధ్, విజయ్‌. లైగర్‌ పూర్తి కాగానే.. మరో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. రేపు మధ్యాహ్నం ఈ పాన్‌ ఇండియా మూవీకి సంబంధించిన అప్డేట్‌ ను ప్రకటిస్తామని అనౌన్స్‌ చేశారు. ఈ అప్డేట్‌ తో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news