అపవిత్ర బంధంతో బలిపీఠం సిద్ధం..విజయసాయి రెడ్డి

-

కేఈ  సిద్ధంగా ఉండండి…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుపై వస్తోన్న వార్తల నేపథ్యంలో  ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌ మూర్తిని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకుంటానని గతంలో కేఈ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ……………

కాంగ్రెస్ తో ఐదో పెళ్లికి …కాదు కాదు అపవిత్ర బంధానికి అడ్డుపడే  ఏ కుటుంబ ద్రోహినైనా చంద్రబాబు ఎలా క్షమించి వదిలేస్తారంటూ.. బాబు గారి మనసు తెలుసుకోకుండా అనవసరంగా నోరు పారేసుకున్న మంత్రులను ఆయనే తన స్వహస్తాలతో బలిపీఠం ఎక్కించడానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారని దీంతో మీరు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చిన కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నందుకు ప్రజలు మిమ్మల్ని నడిబజారులో గుడ్డలిప్పి కొట్టకముందే.. మీ ప్రభువు వేసే శిక్షకు మీరు సిద్ధం అవండీ..అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version