సోనూ సూద్ కు గాలం…చంద్రబాబు కొత్త ప్లాన్ ఇదే : వైసీపీ ఎంపి షాకింగ్ కామెంట్స్

-

టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మొన్నటి వరకు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు చంద్రబాబు వల వేశాడని.. అతను ససేమిరా అనడంతో.. ఇప్పుడు సోనూ సూద్ కు గాలం వేశాడని ఎద్దేవా చేశారు. నిస్వార్థ సేవా కార్యక్రమాలతో ఆయన సంపాదించుకున్న మంచి పేరులో ఎంతో కొంత కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్ అని చురకలు అంటించారు. త్వరలోనే వీళ్ల సంగతి ఆయనకు తెలియక పోదని… ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులుండవని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోకపోతే ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు టిడిపి నాయకులకు ఆక్రోశం ఎందుకో? అని నిలదీశారు.

నిమ్మాడ నుంచి కరకట్ట కొంప వరకు రీసౌండ్ ఎందుకు వస్తోంది?.. పచ్చ మీడియా విషపు రాతలు ఎందుకు రాస్తోంది? అని ఫైర్ అయ్యారు. విశాఖపై రాయలసీమ రౌడీల కన్ను అంటూ విషం చిమ్మిన మీడియా – ఆక్రమణలు తొలగిస్తుంటే కక్ష సాధింపు అంటోందన్నారు. కిందటి ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని బాబుకు తెలుసు అని… విజయం సాధించే మార్గం చూపించే వారెవరైనా దొరికితే వెయ్యి కోట్లయినా వెదజల్లేవాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news