బాదింది నువ్వు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది నువ్వు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. బాదింది నువ్వు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది నువ్వు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. సమయం సందర్భం లేకుండా జిల్లాల యాత్రలు చేసి సాధించేదేమిటి చంద్రబాబూ ? అని నిలదీశారు. పొంతన లేని ప్రసంగాలు విని జనం నవ్వుకుంటున్నారు.  వాట్సాప్ లో ప్రభుత్వ వ్యతిరేక సందేశాలు పంపండి అని వేడుకోవడం ఏంటి మరీ చంఢాలంగా అని చురకలు అంటించారు.

‘అప్పట్లో సిఎం కావాలని మీరు అనుకు న్నారని… ఇప్పుడు మేం కోరుకుంటున్నాం బాబు గారూ’ అని ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారట అంటూ ఎద్దేవా చేశారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. మొత్తం మీద అసలు విషయం ఒప్పుకున్నాడు. సిఎం కావడానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచావు. తర్వాత బోగస్ హామీలతో జనాన్ని మోసం చేశావు. ఇంకా స్కోప్ ఎక్కడిది బాబూ? అని ఫైర్‌ అయ్యారు విజయసాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version