నీ ఉంగరంలో చిప్ ఉందా..ముసలినాయుడు? : విజయసాయిరెడ్డి సెటైర్

-

చంద్రబాబు నాయుడు తాజాగా తన వేలికి ఉంగరం పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. నీ ఉంగరంలో చిప్ ఉందా..ముసలినాయుడు? అంటూ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఏమన్నావ్ చీప్ ట్రిక్స్ ముసలినాయుడు? నీ ఉంగరంలో చిప్ ఉందా? ఎవరేం చేసేది, ఎప్పుడు నిద్రపోయేది, పెళ్ళాంతో కాపురం చేసేది నీ కంప్యూటరుకు సమాచారం ఇస్తుందా! అని ప్రశ్నించారు.

నీ బ్రెయిన్లో ఫ్యూజులు ఎగిరాక Cognitive Impairment అనే ఆఖరిదశలో ఉన్నావు. భ్రాంతికిలోనై ఇలాంటి కధలు అల్లుతావా? నీ పిచ్చి ముదిరిందని ఎద్దేవా చేశారు. మా పార్టీ ప్లీనరీలో ఏర్పాటు చేస్తున్న భోజనాలపైనా చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. ప్లీనరీ ఘన విజయం తర్వాత కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి బోరున ఏడుస్తాడేమో..!అంటూ ఫైర్‌ అయ్యారు సాయిరెడ్డి. జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు హయాంలోనే 20 డిస్టిలరీలకు, 254 మద్యం బ్రాండ్ లకు అనుమతులిచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news