వైజాగ్ స్టీల్ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు జోక్యం అంత మోసమే – రాములమ్మ

-

వైజాగ్ స్టీల్ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు జోక్యం అంత మోసమేనంటూ రాములమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీకేజీ విషయంలో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటపడటంతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కొత్త ఎత్తుగడతో కేంద్రంపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు.


గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున బయ్యారంలో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగితే… తలాతోకా లేకుండా బైలడిల్ల గనుల గురించి కేటీఆర్ గారు మాట్లాడటం పూర్తిగా తప్పించుకునే ధోరణనన్నారు.

సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ గారి సర్కారు వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం మోసపూరితమని విమర్శించారు. తెలంగాణలో మూతపడ్డ సంస్థలను పునరుద్దరించడంపై కార్యాచరణ లేని కేటీఆర్ గారు… ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారిపై అభాండాలు మోపడం అసమర్ధత తప్ప మరొకటి కాదు. అవినీతి మచ్చలేని ప్రధాని నరేంద్రమోదీ గారిపై కేటీఆర్ గారు ఆరోపణలు చేయడం తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news