విజయశాంతి కాంగ్రెస్ లోనే ఉంటారు : వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన

-

కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి విజయశాంతి చేరుతుందన్న ఊహాగానాల నేపధ్యంలో ఆమెతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ భేటీ అయ్యారు. పార్టీ మారుతుందన్న ప్రచారం తో పీసీసీ తరుపున ఆయన వెళ్లి కలిశారు. కాంగ్రెస్ కొన్నాళ్లుగా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి తో విజయశాంతి ఉన్నారని అంటున్నారు. ఎన్నికలు, ప్రచారం సమయంలోనే విజయశాంతి గుర్తు వస్తుందా..? అని విజయశాంతి అలిగినట్టు చెబుతున్నారు.

అయితే ఆమెతో మాట్లాడి వచ్చిన అనంతరం కుసుమ కుమార్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో విజయశాంతి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదుని, విజయశాంతి కాంగ్రెస్ లోనే కొనసాగుతారని అన్నారు. మీడియాలో వస్తున్నవి వాస్తవం కాదని అన్నారు. బీజేపీతో చర్చల ప్రస్తావన కూడా విజయ శాంతి తో రాలేదన్న ఆయన కాంగ్రెస్ విజయశాంతి ని గౌరవంగానే చూస్తోందని అన్నారు. పీసీసీ కూడా ఎన్నికల ప్రచారం కోసం రమ్మని అడిగారని అయితే ఆమె కోవిడ్ వల్ల రాలేనని చెప్పారని అన్నారు. విజయశాంతి కాంగ్రెస్ లోనే ఉంటారన్న ఆయన అసలు పార్టీ మార్పు పై మా మధ్య చర్చ రాలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news