తెరాస నేత దారుణ హత్య…

-

వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో తెరాస నేత నారాయణ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. కొంతకాలంగా నారాయణ‌రెడ్డికి  గ్రామస్థులకు మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యలో  గతంలో నారాయణ‌రెడ్డికి అనుచరులుగా ఉన్న కొంత మంది  గ్రామస్థులు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ చేరారు. దీంతో అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డిపై గ్రామానికి చెందిన కొందరు యువకులు కర్రలు, రాళ్లతో దాడి హత్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన నారాయణ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

నారాయణ‌రెడ్డి హత్యతో రెచ్చిపోయిన ఆయన వర్గీయులు కాంగ్రెస్‌ నాయకుడు సుభాష్‌చందర్‌రెడ్డితో పాటు మరో వ్యక్తి‌పై  దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.  సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news