ఎల్లుండి నుంచి హోమ్ ఓటింగ్‌ ప్రారంభం : వికాస్ రాజ్

-

తెలంగాణ లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అన్ని చోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని వెల్లడించారు. హైదరాబాద్‌లో 3,986 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామన్న వికాస్ రాజ్.. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నామని వివరించారు.

“లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారు. 85 స్వతంత్రులు పోటీలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో నిలిచారు. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు , 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడాల్సి వస్తుంది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఒక ఈవీఎం సరిపోతుంది. ఈసీకి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు రప్పిస్తున్నాం.” అని వికాస్ రాజ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news