ఐపీఎల్ నుండి ఆర్సిబి ఔట్.. విరాట్ ఎమోషనల్ ట్వీట్..!

-

ఐపీఎల్ సీజన్ లో కూడా అభిమానులకు నిరాశ తప్పలేదు. ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరికి మళ్లీ అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఏడాది ప్లే ఆప్ కు చేరుకుంది అని అభిమానులు మురిసిపోతున్న తరుణంలో మొదటి అడుగు లోనే పేలవ ప్రదర్శన చేసి ఎలిమినేటర్ మ్యాచ్ నుంచి వెనుతిరిగింది.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇక నిన్న ఓటింగ్ పై కోహ్లీ ఇటీవలే ఓ భావోద్వేగ పూరితమైన పోస్టు పెట్టాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లు అందరితో దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనప్పటికీ జట్టు సమిష్టిగా రాణించిందని చెప్పుకొచ్చాడు.. కానీ ఈ ఏడాది అనుకున్నంత ఫలితాలు రాబట్టలేకపోయామని కానీ వచ్చే సీజన్లో మాత్రం అభిమానులను నమ్మకాన్ని నిలబెడతాము అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.https://www.instagram.com/p/CHQlSdMlLNL/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news