మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..ముందుగానే వచ్చేస్తున్న ‘‘విరాటపర్వం’’

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘‘విరాట పర్వం’’ అని చెప్పొచ్చు. కరోనా మహమ్మారి వలన ఈ చిత్ర విడుదల తేదీ మారుతూ వచ్చింది. ‘‘నీది నాది ఒకే కథ’’ సినిమాతో ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ, ప్రతీ సారి వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల జూలై 1న మూవీని విడుదల చేస్తామని మూవీ యూనిట ప్రకటించింది. తాజాగా మరో తేదీని ప్రకటించింది. అయితే, ఆ తేదీ మరింత ముందుకు రావడం విశేషం.

జూన్ 17న ఫిల్మ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. జూన్ 17న విడుదల కావాల్సిన మాస్ మహారాజా రవితేజ ‘‘రామారావు ఆన్ డ్యూటీ’’ పోస్ట్ పోన్ అయింది. ఈ క్రమంలోనే ఆ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లున్నారు. 1990లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో రానా..కామ్రేడ్ రవన్న పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక అతని కవితలు చదివి ప్రేమలో పడే వెన్నెల పాత్రను బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి పోషిస్తుండగా, కీలక పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news