ట్రంప్ ని దీవించిన సెహ్వాగ్ బాబా…! కామెడి అంటే ఇదే మరి

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన సహాయకురాలికి కరోనా రావడం ఆ తర్వాత ఆయనకు కరోనా రావడం జరిగింది. నేడు ఉదయం ఆయన కరోనా సోకినట్టు తన ట్విట్టర్ లో ప్రకటించడంతో ప్రపంచం మొత్తం కూడా షాక్ తిన్నది. ఆయన వ్యాధి నుంచి వేగంగా కోలుకోవాలని అన్ని దేశాల అధ్యక్షులు ప్రధానులు సామాజిక మాధ్యమాల ద్వారా దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు.

మన దేశంలో కూడా ట్రంప్ త్వరగా కోలుకుని రావాలని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆకాంక్షించారు. తాజాగా టీం ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అలాగే కోరారు. కాకపోతే అది కాస్త భిన్నంగా ఉంది. ట్రంప్ వేగంగా కరోనా నుంచి కోలుకోవాలని సెహ్వాగ్ బాబా కోరుతున్నారని అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసి గో కరోనా గో అని రాసారు.

Read more RELATED
Recommended to you

Latest news