విశాఖ డెయిరీ చైర్మన్‌ తులసీరావు కన్నుమూత

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. విశాఖ డెయిరీ చైర్మన్‌ తులసీరావు కన్నుమూశారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు (85) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆరోగ్య పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి చెందిన తులసిరావు 30 ఏళ్లుగా విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె పిల్లా రవికుమారి మున్సిపల్ చైర్ పర్సన్. కుమారుడు ఆనంద్ కుమార్ విశాఖ డైయిరీ వైస్ చైర్మన్ గా, విశాఖ నగర పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇన్చార్జిగా ఉన్నారు. గురువారం ఎలమంచిలిలో అంత్యక్రియలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news