మరో రెండు నెలల్లో విశాఖ రాజధానిగా పాలన – మంత్రి అమర్నాథ్

-

మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదే లే.. అంటుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మూడు రాజధానుల పై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో పరిపాలన రాజధాని కార్యకలాపాలు విశాఖపట్నం నుండి ప్రారంభం అవుతాయని ప్రకటించారు. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు పలు టెక్ కంపెనీలు కూడా ఏపీకి రాబోతున్నాయని అన్నారు మంత్రి అమర్నాథ్. విశాఖ ని ఐటీ హబ్ చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఆపిల్ అనుబంధ యూనిట్ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news