ప్రో కబడ్డీ 2019: హర్యానాపై జైపూర్, ముంబాపై యూపీ యోధా గెలుపు

-

నిన్న రెండు మ్యాచులు జరగగా.. అందులో మొదటిది హర్యానా స్టీలర్స్, జైపూర్ పాంథర్స్ మధ్య ఒక మ్యాచ్, యూ ముంబా, యూపీ యోధా మధ్య మరో మ్యాచ్ జరిగింది.

ప్రో కబడ్డీ లీగ్ 2019.. 7 వ సీజన్ గత నెల 20 నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మొత్తం 12 జట్లు మూడు నెలల పాటు టైటిల్ వేట కోసం ఆట కొనసాగించనున్నాయి. అక్టోబర్ 19న ఫైనల్ జరగనుంది. నిన్నటి వరకు అంటే… జులై 31 వరకు 19 మ్యాచులు పూర్తయ్యాయి.

నిన్న రెండు మ్యాచులు జరగగా.. అందులో మొదటిది హర్యానా స్టీలర్స్, జైపూర్ పాంథర్స్ మధ్య ఒక మ్యాచ్, యూ ముంబా, యూపీ యోధా మధ్య మరో మ్యాచ్ జరిగింది.

హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచుల్లో… హర్యానా స్టీలర్స్ పై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. 37-21 తేడాతో జైపూర్ గెలిచింది.

మరోవైపు యూపీ యోధా… ముంబైని ఓడించింది. 27-23 తేడాతో యూపీ యోధా విజయం సాధించింది. ఇక.. ఆగస్టు 1 అంటే ఈరోజు గుజరాత్, ఢిల్లీ మధ్య ఆట ఉండనుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కూడా ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news