క‌రోనా న‌య‌మ‌వ్వాలా ? ర‌మ్ సేవించండి.. కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్ సూచ‌న‌..!

-

మ‌ద్యం సేవిస్తే క‌రోనా న‌యం కాద‌ని సైంటిస్టులు, వైద్య నిపుణులు ఇప్ప‌టికే ఎన్నో సార్లు చెప్పారు. ఇంకా చెబుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రికి మాత్రం ఇంకా జ్ఞానోదయం కావ‌డం లేదు. పైగా తాము మ‌ద్యం తాగుతున్నామ‌ని, క‌రోనా న‌య‌మ‌వుతుంద‌ని.. క‌నుక మీరు తాగండి.. అంటూ ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లువురు సాధార‌ణ వ్య‌క్తులే ఇలా చెప్పారు.. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడే మ‌ద్యం తాగాల‌ని, క‌రోనా న‌య‌మ‌వుతుంద‌ని సూచిస్తున్నాడు.

want to cure corona drink rum says congress party councilor

క‌ర్ణాట‌క‌లోని ఉల్లాల్ సిటీ మున్సిప‌ల్ కౌన్సిల్ (సీఎంసీ)కు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్ ర‌విచంద్ర గ‌ట్టి క‌రోనా క‌ట్ట‌డికి అంద‌రినీ ర‌మ్ తాగ‌మ‌ని చెబుతున్నాడు. బ్రాందీ, విస్కీ, వోడ్కాలాగే ర‌మ్ కూడా ఒక మ‌ద్యం వెరైటీ. దీన్ని ప‌లు భిన్న కంపెనీలు త‌యారు చేస్తున్నాయి. ర‌మ్‌తోపాటు హాఫ్ బాయిల్డ్ ఎగ్‌పై మిరియాల పొడి చ‌ల్లుకుని తీసుకుంటే క‌రోనా న‌య‌మ‌వుతుంద‌ని చెబుతున్నాడు. అత‌ను అలా చెబుతున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ ఫొటోలో అత‌ను చేతిలో ర‌మ్ బాటిల్‌తో క‌నిపిస్తుండ‌డం విశేషం.

అయితే దీనిపై అక్క‌డి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు సీరియ‌స్ అయ్యారు. అత‌నిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు అత‌ని సూచ‌న‌ల‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా.. కొంద‌రు మాత్రం స‌ర‌దాకి తీసుకుని న‌వ్వుకుంటున్నారు. అయితే మీరు మాత్రం అత‌ని సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకోకండి. ఎందుకంటే.. మ‌ద్యం సేవిస్తే క‌రోనా అంతం కాదు. అలా అయ్యేదుంటే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థే ఎప్పుడో చెప్పేది. క‌నుక ఇలాంటి సూచ‌న‌ల‌ను న‌మ్మ‌కండి.

Read more RELATED
Recommended to you

Latest news