పునీత్ ప్రాణాలు పోవడానికి కోవీషీల్డ్ కారణమా? నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్

-

పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు ఛాతిలో నొప్పి మొదలైంది. కారు వద్దకు కూడా పునీత్ రాజ్ కుమార్ నడిచి వచ్చాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా కారులోనే ఆయన కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. 46 ఏళ్ళ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు.

 

అలాంటి పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక సేవ చేస్తూ రియల్ హీరోగా జనాల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ మరణం అందరినీ కలచివేసింది. సౌత్ ఇండియాకు చెందిన పలువురు స్టార్స్ ఆయన కుటుంబాన్ని కలిసి సంతాపం ప్రకటించారు. ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్ కుమార్ కి గుండె పోటు రావడానికి కారణం తెరపైకి వచ్చింది. ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వలనే మరణించారనే వాదన మొదలైంది. ఇండియాలోకారణం కోవిడ్ నుండి రక్షణ కోసం కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ అనే రెండు రకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కోవిషీల్డ్ కారణంగానే పుణిత్ మరణించినట్టు నెట్టింట్లో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news