పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటాం – కన్నా లక్ష్మీనారాయణ

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మేమంతా అండగా ఉంటాం అన్నారు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్, తెలంగాణలో బండి సంజయ్ ని వీక్ చేసేందుకు సీఎం జగన్, కెసిఆర్ కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే బిఆర్ఎస్ లో ఆంధ్రప్రదేశ్ నేతలు చేరుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కాపులపై మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు.

అలాగే బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షుడిని మార్చడం పై సోము వీర్రాజు పై మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ. కోర్ కమిటీలో చర్చించకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు. కోర్ కమిటీ సమావేశంలో తప్ప పార్టీలో ఏ ఇతర విషయాలు మాకు తెలియడం లేదన్నారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమందిని బీజేపీలో జాయిన్ చేశానని.. ఇప్పుడు వారు ఎందుకు పార్టీ వీడుతున్నారో సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news