దిల్ రాజు తీరుతో తమిళనాడులో అలజడి.!

-

దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్, మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.హీరో విజయ్ కి వున్న  రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా  జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది.

అయితే సంక్రాంతికి తమిళనాడు లో అజిత్ సినిమా, తన సినిమా థియేటర్స్ లో విడుదల విషయంలో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని కామెంట్స్ చేసి ఫ్యాన్స్ మధ్యలో అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. అది ఇప్పట్లో ఆరి పోయే పరిస్థితి కనిపించడం లేదు. అసలే తమిళ హీరోల ఫ్యాన్స్ మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. దిల్ రాజు చేసిన పనికి అది ఇంకా పెద్దగా అయ్యింది. సోషల్ మీడియాలో కల్లోలం గా ఉంది.

రీసెంట్ గా హీరో అజిత్ ను కించ పరుస్తూ విజయ్ అభిమానుల పోస్టర్లు ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతున్నాయి. ఇందుకు  అజిత్‌ అభిమానులు కూడా దీటుగా స్పందిస్తున్నారు. వారు కూడా విజయ్ ను కించ పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక వారుకూడా పరస్పరం పోస్టర్ యుద్దానికి సిద్దం అయినట్లు తెలుస్తోంది. అయితే అసలు లు రిలీజ్‌ కాకముందే  గోలగా ఉంటే…ఇక సినిమాలు విడుదల అయితే పరిస్తితి ఏంటని భయపడి చస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news